Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు నగలను ఎలా శుభ్రం చేయాలంటే?

రోజూ వేసుకునే బంగార నగలు కొన్ని కారణాల వలన రంగుమారి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. వీటి మెరుపు తగ్గకుండా ఉండాలంటే శుభ్రం చేయడానికి, భద్రపరచడానికి తగిన జాగ్రత్తలు అవసరం. మరి అవేంటో తెలుసుకుందాం.

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (12:39 IST)
రోజూ వేసుకునే బంగార నగలు కొన్ని కారణాల వలన రంగుమారి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. వీటి మెరుపు తగ్గకుండా ఉండాలంటే శుభ్రం చేయడానికి, భద్రపరచడానికి తగిన జాగ్రత్తలు అవసరం. మరి అవేంటో తెలుసుకుందాం.
 
గిన్నె నిండా వేణ్నీళ్లు నింపి అందులో కొన్ని చుక్కల లిక్విడ్ డిష్‌వాష్ జెల్ వేయాలి. ఈ నీళ్లలో నగలు వేసి 20 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత బ్రష్‌తో రుద్ది కడిగి మెత్తని వస్త్రంతో తుడిచి టిష్యూ కాగితంలో చుట్టి ఉంచాలి. ఇలా చేయడం వలన తేమ తొలగిపోతుంది. రాళ్ల నగల్ని సాధ్యమైనంత వరకు వేణ్నీళ్లలో ఉంచకపోవడం మంచిది.
 
విలువైన రాళ్లు రత్నాలు, పొదిగి ఉన్న నగల్ని మామూలు నీళ్లలో అసలు తడపకూడదు. సాధ్యమైనంత వరకు తడి వస్త్రంతో తుడుచుకోవాలి. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లతో నగల్ని తడపడం వలన విలువైన రాళ్లు రంగుమారే ప్రమాదం ఉంటుంది. ఈత కొట్టే అలవాటున్న వాళ్లు తప్పనిసరిగా చెవులకున్న పోగులను కూడా తీయాలి. ఈ నీళ్ల వలన రంగు మారుతాయి.
 
అలా జరిగితే బొగ్గు పొడితో శుభ్రం చేస్తే సరిపోతుంది. కుంకుడు కాయ రసంలో నానబెట్టినా ఫలితం ఉంటుంది. కప్పు నీళ్లలో వంటసోడా కలిపి అందులో నగలు వేసి వేడి చేయాలి. తరువాత పొడి వస్త్రంతో శుభ్రపరచి నీడలో గాలికి ఆరనిస్తే కొత్త వాటిలా మెరిసిపోతాయి. విలువైన రంగు రాళ్లను పిల్లలు ఉపయోగించే మెత్తని బ్రష్‌తో శుభ్రం చేయాలి. గరుకుగా ఉండేవాటిని ఉపయోగిస్తే వాటిమీద గీతలు పడే ప్రమాదం ఉంది.
 
బంగారు నగలను గాఢత కలిగిన సబ్బుల ద్రావణాల కంటే తడి టిష్యూలతో శుభ్రం చేసినా ఫలితం ఉంటుంది. క్లోరిన్, ఉప్పు నీళ్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆభరణాల్ని శుభ్రం చేయకూడదు. సువాసన పరిమళాలు, క్రీములు పెట్టిన చోట వీటిని పెట్టకూడదు. అలానే ధరించిన తరువాత కూడా వీటిని వాడకపోవడం మంచిది. వాటిలోని రసాయనాల ప్రభావం వలన నగలు రంగును కోల్పోయి పాత వాటిలా కనిపించే అవకాశం అధికంగా ఉంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments