Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 'కథానాయకుడు' ఆ 'యాత్ర'.... ఏపీ ఎన్నికల్లో లబ్ది కోసమేనా?

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (17:12 IST)
మహానటి... సావిత్ర జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఈ చిత్రంలో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించారు. ఆనాటి నటి సావిత్రి గురించి ఈ చిత్రం ద్వారా దర్శకుడు చక్కగా చెప్పాడు. ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. ఇలాంటి బయోపిక్ చిత్రాలు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వచ్చాయి. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఇద్దరు నాయకులకు సంబంధించి బయోపిక్ చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
 
ఒకటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న కథానాయకుడు చిత్రం. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు, నట సింహం బాలయ్య నటిస్తున్నాడు. మరోవైపు రెండో చిత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బయోపిక్ యాత్ర. ఈ చిత్రంలో ప్రముఖంగా వైఎస్సార్ చేసిన సుదీర్ఘ పాదయాత్రను, అనంతరం ఆయన అధికారం చేపట్టడాన్ని చూపించనున్నారని వినిపిస్తోంది.
 
ఇదిలావుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికలకు ముందు ఈ రెండు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. యాత్ర చిత్రం ద్వారా జగన్ మోహన్ రెడ్డికి ఎన్టీఆర్ కథానాయకుడు ద్వారా చంద్రబాబు నాయుడికి లబ్ది చేకూరుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఈ చిత్రాలు ఆ నాయకులకు అంతగా ఉపయోగపడుతాయో లేదంటే మహానటిలా కలెక్షన్ల వరకే పరిమితమవుతాయో చూద్దాం.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments