ఏటీఎంలలో స్కిమ్మింగ్ ఎలా చేస్తారు?

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (13:13 IST)
సైబర్ నేరాలు అనగానే... ఇప్పటివరకు ఠక్కున గుర్తుకు వచ్చేది నైజీరియా. ఏటీఎం కార్డు అప్‌డేట్, లాటరీ వచ్చిందని, ఇలా పలు కారణాలు చెబుతూ అందినకాడికి దోచుకునేవారు. అయితే తాజాగా రొమేనియన్లు ఏటీఎం కార్డుల క్లోనింగ్ కోసం దేశంలోకి చొరబడ్డారు. వీరు కార్డులను క్లోనింగ్ చేయడంలో ఆరితేరారు. 
 
నెల రోజుల కాంట్రాక్టుతో దేశంలోని పలు పట్టణాల్లోకి వచ్చి ఏటీఎం సెంటర్లలో స్కిమ్మ ర్లు, కెమెరాలు పెట్టి డేటాను చోరీ చేసి.. ప్రధాన సైబర్ నేరగాడికి ఇచ్చేస్తున్నారు. ఇలా డేటా చోరీకి పాల్పడుతున్న రొమేనియా దేశానికి చెందిన నిందితులను గత యేడాది ఏప్రిల్‌లో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో వీరి మోసాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి అబిడ్స్ పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. అబిడ్స్ పోలీసుల దర్యాప్తులో పలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
 
అసలు స్కిమ్మింగ్ ఎలా చేస్తారో ఓసారి తెలుసుకుందాం. ఏటీఎం మిషన్‌లో డబ్బులు డ్రా చేసే చోట మ్యాగ్నటిక్ రీడర్, ఒక స్పై కెమెరాను ఈ ముఠాలు అమరుస్తాయి. ఏటీఎం కేంద్రంలోకి వినియోగదారుడు వెళ్లి డబ్బులు డ్రా చేసేందుకు కార్డును స్వైప్ చేసిన సమయంలో కార్డు వివరాలు మ్యాగ్నటిక్ రీడర్ కాపి చేస్తుంది. పిన్ నంబర్‌ను కెమెరా రికార్డు చేస్తుంది. ఇలా ఒక రోజంతా ఆ కార్డు మిషన్‌లో ఉంటే ఆ రోజు ఏటీఎం కార్డులో డబ్బులు డ్రా చేసిన వారి వివరాలు కాపీ చేస్తుంది. 
 
అయితే ఈ ముఠాలు ఒక రోజంతా మ్యాగ్నటిక్ రీడర్, కెమెరాను ఒకే దగ్గర ఉంచకుండా జాగ్రత్త పడుతారు. కొన్ని గంటల వ్యవధిలోనే వాటిని తొలగించి, మరో చోట ఏర్పాటు చేస్తారు. ఎక్కువ సమయం ఒకే దగ్గర ఉంచితే గుర్తిస్తారనే అనుమానంతో ఇలా మారుస్తుంటారు. సెక్యూరిటీ లేని ఏటీఎం కేంద్రాల్లో ఈలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. 
 
స్కిమ్మింగ్ ద్వారా సేకరించిన డేటాను ఎప్పడికప్పుడు.. తమ బాస్‌కు చేరవేస్తుంటారు. అయితే ఇక్కడ స్కిమ్మింగ్ చేసే వారిచేతిలో ల్యాప్‌టాప్‌లు ఉంటాయి. విదేశాల్లో ఉండే బాస్.. వీరి కంప్యూటర్‌ను టీమ్ వ్యూహార్‌తో యాక్సెస్ చేసుకుంటూ.. వీరి వద్ద ఉండే డేటాను తన కంప్యూటర్‌లోకి ఎప్పటికప్పుడు కాపీ చేసుకుంటాడు. అలా సేకరించిన డేటాతో క్లోనింగ్‌తో కొత్త కార్డులను తయారు చేస్తాడు. క్లోనింగ్ కార్డులను ఉపయోగించి డబ్బులు డ్రా చేసేందుకు మరో టీమ్‌తో ఒప్పందాలు చేసుకొని ఇండియాకు పంపిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది

Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్

Revanth Reddy: ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని నిలదీసే రోజు రావాలి : అనసూయ

Nani Review: మృత్యుంజయ్ నాకు చాలా నచ్చింది : నేచురల్ స్టార్ నాని రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments