జనసేనను పవన్ బీజేపీలో విలీనం చేస్తారా?

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (12:50 IST)
జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశమైనాయి. గతంలో బీజేపీని, అమిత్ షాని తిట్టిపోసిన పవన్.. ప్రస్తుతం రూటు మార్చి ఏపీ సీఎం జగన్‌పై ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్ బీజేపీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తావన తీసుకురావడం సంచలనంగా మారింది.
 
ప్రస్తుతం దేశ రాజకీయాలకు మోదీ, అమిత్ షా వంటి వ్యక్తులే కరెక్ట్ అని, అలాంటి వారే అన్యాయాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తారంటూ పవన్ కామెంట్ చేశారు. ఆ భయం వీళ్లకు ఉందని, అందుకే వాళ్ళను చూసి భయపడుతున్నారంటూ వైసీపీని టార్గెట్ చేశారు.
 
అంతేగాకుండా తానెప్పుడూ బీజేపీకి దూరంగా లేనని.. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో విభేదించి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశానని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. 
 
అలాగే తెలుగుదేశం, బీజేపీ క‌లిపి ప‌నిచేస్తే అధికారంలోకి వ‌స్తుంద‌న‌డం కొస మెరుపు. ఏదేమైన‌ ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ అమిత్ షా ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారనే దానిపై రాజకీయవర్గాల్లో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. 
 
ఏపీలో అధికార వైసీపీని కనుమరుగు చేయాలంటే..  బీజేపీలో జనసేనను విలీనం చేయడం ఒక్కటే మార్గమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని టాక్ వస్తోంది. అందుకే జనసేనాని నోట బీజేపీపై మాటలొచ్చాయని రాజకీయ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments