Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్ళీ వేడెక్కిన నంద్యాల రాజకీయం... ఎందుకంటే..?

నంద్యాల రాజకీయం మళ్ళీ వేడెక్కింది. మున్సిపల్ ఛైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు అధికారపార్టీ పావులు కదుపుతోంది. పదవిని నిలబెట్టుకునేందుకు వైసీపీ స్కెచ్ గీస్తోంది. పోటాపోటీ వ్యూహాలతో రాజకీయం హీటెక్కిం

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (10:46 IST)
నంద్యాల రాజకీయం మళ్ళీ వేడెక్కింది. మున్సిపల్ ఛైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు అధికారపార్టీ పావులు కదుపుతోంది. పదవిని నిలబెట్టుకునేందుకు వైసీపీ స్కెచ్ గీస్తోంది. పోటాపోటీ వ్యూహాలతో రాజకీయం హీటెక్కింది. నంద్యాల ఉప ఎన్నికల తరువాత మళ్లీ రాజకీయాలు ఊపందుకున్నాయి.


వైసీపీ చేతిలో ఉన్న మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టిడిపి ఎత్తులు వేస్తోంది. మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్న సులోచన పదవిని చేపట్టి నాలుగేళ్ళు పూర్తి కావస్తోంది. దీంతో అవిశ్వాసతీర్మానం పెట్టి ఆమెను గద్దె దించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
2014 సంవత్సరంలో నంద్యాల మున్సిపాలిటీ 42వార్డులకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీడీపీలో ఉన్న శిల్పామోహన్ రెడ్డి వర్గానికి చెందిన 29మంది కౌన్సిలర్లు గెలుపొందారు. వైసీపీకి చెందిన సులోచన ఛైర్మన్ అయ్యారు. అయితే అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వర్గానికి చెందిన 13మంది కౌన్సిలర్లు గెలుపొందారు. ఆ తరువాత భూమా టీడీపీలో చేరడంతో శిల్పా వర్గంలోని కౌన్సిలర్లందరూ భూమా వర్గంలో చేరారు. ఉప ఎన్నికల సమయంలో భూమా వైసీపీలో చేరితే కొంతమంది కౌన్సిలర్లకు ఛైర్మన్ పదవి ఇస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చారు.
 
ఇప్పుడు నాలుగేళ్ళు పూర్తి కావడంతో ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఛైర్మన్ గిరి కోసం రెడ్డి, కాపు సామాజిక వర్గం నుంచి పోటీలు పడుతున్నారు. అయితే అధికార పార్టీకి అంత సీన్ లేదని, ముగ్గురు, నలుగురికి ఛైర్మన్ పదవి ఇస్తామని చెప్పి వారిలోనే గొడవలు పెడుతున్నారంటున్నారు వైసీపీ నేతలు. మొత్తం మీద రెండు పార్టీలు గొడవలు పడడంతో ఒక్కసారిగా కర్నూలు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments