Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠం నేర్పిన గోవా రిజల్ట్స్ ... ఆగమేఘాలపై మేఘాలయకు పరుగోపరుగు

గోపా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఓ మంచి గుణపాఠం నేర్పాయి. ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయింది.

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (14:43 IST)
గోపా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఓ మంచి గుణపాఠం నేర్పాయి. ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయింది. కమలనాథులు వ్యూహాత్మకంగా పావులు కదిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదురైనా బీజేపీ అధిష్టానం మాత్రం వెనక్కి తగ్గలేదు. 
 
ఈ నేపథ్యంలో శనివారం మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 21 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అదేసమయంలో బీజేపీ 16 సీట్లలో గెలవగా, ఎన్.పి.పి 16 సీట్లలో, ఇతరులు 10 చోట్ల గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వరాదన్న పట్టుదలతో ఉంది. 
 
ఇందుకోసం ఇతర పార్టీల మద్దకు కూడగట్టేందుకు పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలను కాంగ్రెస్ హుటాహుటిన షిల్లాంగ్ పంపింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, కమల్‌నాథ్‌లు ఉదయమే షిల్లాంగ్ బయలుదేరారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తక్షణమే వీరు గెలిచిన స్వతంత్ర అభ్యర్థులతో మంతనాలు సాగించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments