Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో బీజేపీని గెలిపించిన మణిశంకర్ అయ్యర్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ మరోమారు విజయభేరీ మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించి వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంద

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (14:19 IST)
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ మరోమారు విజయభేరీ మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించి వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే, గుజరాత్‌లో బీజేపీని కాంగ్రెస్ నుంచి సస్పెండ్‌కు గురైన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ గెలిపించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
నిజానికి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఇందుకోసం కుల రాజకీయాలను తెరపైకి తెచ్చింది. పటీదార్లతో ముస్లిం, దళిత వర్గాలకు చెందిన అగ్రనేతలను అక్కున చేర్చుకుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని 'నీచుడు', 'సభ్యత'లేని వాడు అంటూ మండిపడ్డారు. 
 
ఈ వ్యాఖ్యలతో బీజేపీకి మంచి పట్టుదొరికినట్టయింది. అప్పటివరకు చప్పగా సాగిన ప్రచారం మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలతో వేడిరాజుకుంది. అయ్యర్ వ్యాఖ్యలను ప్రధాని మోడీ పదేపదే ప్రస్తావిస్తూ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గుజరాత్ ప్రజలను నీచులని అంటోందని ప్రధాని చేసిన ప్రచారం బీజేపీకి కలిసొచ్చిందనే భావన వ్యక్తమవుతోంది. 
 
అలాగే, తనను చంపించేందుకు మణిశంకర్ అయ్యర్ పాక్‌తో కలిసి వ్యూహం రచించారని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా పాకిస్థాన్‌తో చేతులు కలిపి కాంగ్రెస్ తమను ఓడించాలని చూస్తుందని, అహ్మద్ పటేల్‌ను సీఎంను చేసేందుకు పాక్‌ సహకారంతో కుట్ర పన్నుతోందని మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments