Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిడ్ మానేరు జలాశయంలో దూకి ముగ్గురు పిల్లల తల్లి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (17:34 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. శభాష్ పల్లి వంతెన వద్ద మిడ్ మానేరు జలాశయంలో దూకి ముగ్గురు పిల్లల తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో తల్లి రంజిత, ఆమె పిల్లలు ఉస్మాన్ అహ్మద్ (14), అయ్యన్ (7), అశ్రజాబిన్ (5 నెలలు) అనే పిల్లలు ఉన్నారు. వేమువాడ అర్బన్ మండలం రుద్రవరంకి చెందిన రజిత కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌కు చెందిన మహ్మద్ అలీ అనే వ్యక్తిని గత తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి వీరి మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో రజిత పుట్టింటివారు వేముల వాడలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. రెండు నెలల క్రితం కేసును కొట్టివేశారు. భార్యాభర్తలిద్దరూ రాజీకి రావడంతో ఈ కేసును కోర్టు కొట్టివేసింది. అయితే, గత మూడు రోజుల క్రితం రజిత తన పిల్లలతో పుట్టింటికి రాగా మర్నాడు తన భర్త దగ్గరికి వెళ్లాలని కుటుంబీకులు చెప్పగా.. తన పిల్లలతో జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments