Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిడ్ మానేరు జలాశయంలో దూకి ముగ్గురు పిల్లల తల్లి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (17:34 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. శభాష్ పల్లి వంతెన వద్ద మిడ్ మానేరు జలాశయంలో దూకి ముగ్గురు పిల్లల తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో తల్లి రంజిత, ఆమె పిల్లలు ఉస్మాన్ అహ్మద్ (14), అయ్యన్ (7), అశ్రజాబిన్ (5 నెలలు) అనే పిల్లలు ఉన్నారు. వేమువాడ అర్బన్ మండలం రుద్రవరంకి చెందిన రజిత కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌కు చెందిన మహ్మద్ అలీ అనే వ్యక్తిని గత తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి వీరి మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో రజిత పుట్టింటివారు వేముల వాడలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. రెండు నెలల క్రితం కేసును కొట్టివేశారు. భార్యాభర్తలిద్దరూ రాజీకి రావడంతో ఈ కేసును కోర్టు కొట్టివేసింది. అయితే, గత మూడు రోజుల క్రితం రజిత తన పిల్లలతో పుట్టింటికి రాగా మర్నాడు తన భర్త దగ్గరికి వెళ్లాలని కుటుంబీకులు చెప్పగా.. తన పిల్లలతో జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments