Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్షన్ డబ్బు కోసం భర్తను కిరాతకంగా హత్యాయత్నం భార్య.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2023 (13:36 IST)
పెన్షన్ డబ్బు కోసం కట్టుకున్న భర్తను ఓ కసాయి భార్య కిరాతకంగా చంపేసేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం ఇద్దరు యువకుల సాయం తీసుకుంది. అయితే, అదృష్టవశాత్తు ఆ బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, 
 
థానే జిల్లాలోని కళ్యాణ్ నగరంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితుడిపై అతడి భార్య, నిందిత యువకులు ఇద్దరు దాడి చేశారు. అనంతరం మండే ద్రవాన్ని అతడిపై పోయగా భార్య నిప్పంటించింది. ఈ విషయాన్ని గుర్తించిన ఇరుగుపొరుగువారు మంటలు ఆర్పి బాధితుడిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
నెలవారీ పెన్షన్ విషయంలో భార్య తనతో గొడవ పడుతుండేదని, ఇద్దరు యువకులు తరచూ ఇంటికి వచ్చి వెళ్తుండడంపై తాను అభ్యంతరం తెలిపేవాడినని బాధితుడు చెప్పాడు. శుక్రవారం రాత్రి కూడా ఇలానే వాగ్వాదం జరిగిందని, ఇద్దరు యువకులు వచ్చి తనపై దాడి చేశారని చెప్పారు. 
 
మండే ద్రవాన్ని పోసి నిప్పు అంటించారని బాధితుడు వాపోయాడు. ఈ మేరకు హాస్పిటల్లో చికిత్స పొందుతూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. హత్యాయత్నంలో పాల్గొన్న నిందిత యువకుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితుడు గతంలో ఒకసారి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో నిందిత యువకులు బాధితుడి కూతుళ్లలో ఒకరికి స్నేహితుడు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ కుమార్తెలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కుటుంబం తిరుమల దేవదేవుడిని దర్శించుకున్న వేళ

వేట్టయన్- ద హంట‌ర్‌... గ్రిప్పింగ్‌గా సాగిన ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ట్రైల‌ర్‌

మిస్టర్ సెలెబ్రిటీ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి

కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించిన అక్కినేని నాగార్జున

థియేటర్స్, ఓటీటీలోనూ ఆదరణ పొందేలా కలి సినిమా ఉంటుంది : చిత్ర సమర్పకులు కె రాఘవేంద్ర రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

తర్వాతి కథనం
Show comments