Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగింటి మగాడితో పడక సుఖానికి బానిసైన భార్య.. అడ్డొస్తున్న భర్తను చంపేసింది..

ఠాగూర్
ఆదివారం, 26 జనవరి 2025 (08:46 IST)
పొరుగింటి మగాడితో అక్రమ పడక సుఖానికి ఓ వివాహిత బానిసైంది. ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో ఆయన భార్యను మందలించాడు. అప్పటి నుంచి తన ప్రియుడుతో ఏకాంతంగా గడపడతం కష్టసాధ్యంగా మారింది. దీన్ని తట్టుకోలేని ఆ మహిళ.. తన ప్రియుడుతో కలిసి భార్యను చంపేసింది. ఈ దారుణం ఏపీలోని తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం గజసింగ రాజుపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గజసింగ రాజపురానికి చెందిన ఆంథోని (32)కి, చిత్తూరు జిల్లా నిండ్ర మండలం ఇరుగువాయికి చెందిన సుగంధితో 12 యేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి పదేళ్ల లోపులగల ధనిత. దక్షిత అనే ఇద్దరు కుమార్తెలు, దేవిప్రసాద్ అనే అబ్బాయి ఉన్నారు. ఆంథోని తాగుడుకు బానిసై భార్యను వేధించసాగాడు. పైగా, భార్య కోరికలను తీర్చలేక పోయాడు. 
 
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అరుణ్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే, ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. అంతే... తమ సుఖానికి అడ్డుగా ఉన్న భర్తను అంతం చేయాలని ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. 
 
శనివారం తెల్లవారుజామున మద్యం మత్తులో నిద్రిస్తున్న ఆంథోని మెడకు సుగంధి, అరుణ్‌లు తాడును బిగించి చంపేశారు. తర్వాత వారిద్దరూ గ్రామం విడిచి పారిపోయారు. దీంతో ఇటు తండ్రి భౌతికంగా దూరం కావడం, తల్లి పరాయి మగాడితో లేచిపోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేస్తామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments