Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై సామూహిక అత్యాచారం చేయించిన మహిళ.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 29 మే 2022 (17:41 IST)
ఆమె కూడా తనలాంటి ఆడదే అనే విషయాన్ని మరిచిపోయిన ఓ మహిళ.. ఓ యువతిపై అత్యాచారం చేయించింది. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కొండాపూర్ శ్రీరాంనగర్‌లో భర్తతో కలిసి ఓ మహిళ నివాసం ఉంటోంది. అదే కాలనీలో ఉండే యువతితో మహిళ భర్తకు పరిచయం ఏర్పడడంతో ఇద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకుంటుండే వారు. ఇది చూసిన ఆ మహిళ ఇద్దరిపై అనుమానం పెంచుకొని.. పైశాచిక కుట్రకు పథకం వేసింది. 
 
ఈ నెల 26న మాట్లాడాలి రమ్మంటూ యువతిని శ్రీరాంనగర్‌లోని తన ఇంటికి పిలిచి.. ఇంట్లోని బాత్‌రూంలో బంధించింది. ఆ తర్వాత యువతి నోట్లో గుడ్డలు కుక్కి.. నలుగురు యువకులను పిలిపించి వారితో యువతిపై దాడి చేయించింది.
 
ఆ నలుగురు యువతిపై అత్యాచారయత్నం చేయడంతో పాటు పైశాచికంగా హింసించారు. యువతి ప్రైవేట్ భాగాలపై దాడి చేశారు. ఈ మొత్తాన్ని సదరు మహిళ ఫోన్‌లో చిత్రీకరించింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించింది.
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళతో పాటు నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం