Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై సామూహిక అత్యాచారం చేయించిన మహిళ.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 29 మే 2022 (17:41 IST)
ఆమె కూడా తనలాంటి ఆడదే అనే విషయాన్ని మరిచిపోయిన ఓ మహిళ.. ఓ యువతిపై అత్యాచారం చేయించింది. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కొండాపూర్ శ్రీరాంనగర్‌లో భర్తతో కలిసి ఓ మహిళ నివాసం ఉంటోంది. అదే కాలనీలో ఉండే యువతితో మహిళ భర్తకు పరిచయం ఏర్పడడంతో ఇద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకుంటుండే వారు. ఇది చూసిన ఆ మహిళ ఇద్దరిపై అనుమానం పెంచుకొని.. పైశాచిక కుట్రకు పథకం వేసింది. 
 
ఈ నెల 26న మాట్లాడాలి రమ్మంటూ యువతిని శ్రీరాంనగర్‌లోని తన ఇంటికి పిలిచి.. ఇంట్లోని బాత్‌రూంలో బంధించింది. ఆ తర్వాత యువతి నోట్లో గుడ్డలు కుక్కి.. నలుగురు యువకులను పిలిపించి వారితో యువతిపై దాడి చేయించింది.
 
ఆ నలుగురు యువతిపై అత్యాచారయత్నం చేయడంతో పాటు పైశాచికంగా హింసించారు. యువతి ప్రైవేట్ భాగాలపై దాడి చేశారు. ఈ మొత్తాన్ని సదరు మహిళ ఫోన్‌లో చిత్రీకరించింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించింది.
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళతో పాటు నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం