Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్లలో రైల్వే విశ్రాంత ఉద్యోగితో వివాహేతర సంబంధం, పెట్రోలు పోసుకుని వాటేసుకుంది

ఐవీఆర్
శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (16:39 IST)
బాపట్ల రైల్వే స్టేషను సమీపంలో పట్టపగలే దారుణం జరిగింది. విశ్రాంత రైల్వే ఉద్యోగితో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తున్న మహిళ తనను దూరం పెడుతున్నాడంటూ తనపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. అలా మంటలతో సహా అతడిని వాటేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
బాపట్ల రైల్వే స్టేషను సమీపంలో విశ్రాంత ఉద్యోగి లక్ష్మీనారాయణ ప్రైవేట్ రిజర్వేషన్ కౌంటర్ నడుపుతున్నాడు. ఈయనతో ఓ మహిళ గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం వున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు మహిళ ఈరోజు మధ్యాహ్నం కౌంటరు వద్దకు వచ్చి నారాయణతో గొడవకు దిగింది. తనను ఎందుకు దూరం పెడుతున్నావంటూ నిలదీసింది. మాటామాటా పెరిగి చిన్న వాగ్వాదానికి దారి తీసింది. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధిత మహిళ తన శరీరంపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది.
 
అనంతరం మంటలు చెలరేగుతుండగా నాతోపాటే నీవు కూడా చద్దువుకాని రా అంటూ అతడిని వాటేసుకుంది. దీనితో ఇద్దరికీ మంటలు వ్యాపించాయి. నారాయణ తనను రక్షించాలంటూ కేకలు వేయడంతో స్థానికులు వెంటనే మంటలను ఆర్పేసారు. ఐతే బాధితురాలికి శరీరం 50 శాతానికి పైగా కాలిపోయినట్లు సమాచారం. నారాయణకు 30 శాతానికి పైగా శరీరం కాలినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments