అప్పుల బాధ భరించలేక భర్తను చంపి భార్య ఆత్మహత్యాయత్నం

సెల్వి
శనివారం, 30 ఆగస్టు 2025 (14:25 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ జంట అప్పుల బాధ భరించలేక దారుణం నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ కలిసి చనిపోవాలని నిశ్చయించుకున్నారు. ఇంట్లో కూరగాయలు తరిగే కత్తితో భర్త గొంతు కోసి చంపేసిన భార్య.. ఆ తర్వాత అదే కత్తితో తన కూడా గొంతుకోసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీలో చోటుచేసుకుంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... కేపీహెచ్‌బీలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు రామకృష్ణ, రమ్యకృష్ణలు అప్పుల పాలయ్యారు. ఇటీవల అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి తీవ్రమైంది. పైగా, అప్పు తిరిగి చెల్లించే మార్గం లేకపోవడంతో భార్యాభార్తలు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. 
 
దీంతో తమ ఇంట్లోనే వారు ఆత్మహత్య ప్రయత్నించారు. తొలుత భర్త కొంతు కోసి చంపిన రమ్యకృష్ణ.. ఆ తర్వాత అదే కత్తితో తన గొంతుకోసుకుంది. చుట్టుపక్కుల వారు దీన్ని గమనించి ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే రామకృష్ణ చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
రమ్యకృష్ణను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం అధికంగా రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments