టెక్కీ హత్య కేసు : హంతకుడి ఆచూకీ చెబితే రూ.5.7 కోట్ల రివార్డు

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (18:23 IST)
గత 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన టెక్కీ ప్రభా అరుణ్ కుమార్(41) హత్య కేసులో హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.5.75 కోట్ల రివార్డు ఇస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. బెంగుళూరుకు చెందిన ప్రభా అరుణ్ కుమార్‌ను గత 2015 మార్చి 7వ తేదీన గొంతులో కత్తితో పొడిచి దండగులు హత్య చేశారు. హత్య జరిగి సుమారుగా పదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు హంతకుడి ఆచూకీని గుర్తించలేకపోతున్నారు. దీంతో హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి మిలియన్ డాలర్ల అంటే మన దేశ కరెన్సీలో రూ.5.75 కోట్లు ఇస్తామని ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్ ప్రభుత్వం ప్రకటించింది. 
 
బెంగుళూరులోని మైండ్ ట్రీ కంపెనీలో పనిచేస్తూ వచ్చిన ప్రభ విధి నిర్వహణలో భాగంగా సిడ్నీకి వెళ్ళారు. అక్కడ విధులు ముగించుకుని బెంగుళూరులో ఉన్న తన భర్తతో ఫోనులో మాట్లాడుతూ, ఇంటికి నడిచి వస్తున్న సమయంలో ఆమె ఉండే ఇంటికి 300 మీటర్ల దూరంలో హత్యకు గురయ్యారు. ఆమెను ఎవరు హత్య చేశారు. ఎందుకు హత్య చేశారన్న విషయాన్ని ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా పోలీసులు హంతకుల ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

Rajamouli : బాహుబలి ది ఎపిక్ తో సరికొత్త ఫార్మెట్ లో రాజమౌళి మార్కెటింగ్ సక్సెస్

Rashmika : రష్మిక మందన్న ఫిల్మ్ మైసా కి స్టార్ కంపోజర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్

OG Trend: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఓజీతో నయా ప్లాట్‌ఫాం గ్రాండ్ ఎంట్రీ..

Rahul Sankrityan: వీడీ 14 లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు - రాహుల్ సంకృత్యన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments