Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూవింగ్ ట్రైను ఏసీ బోగీలో మహిళపై టీటీఈ అత్యాచారం...

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (08:23 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. వేగంగా వెళుతున్న రైలు ఏసీ బోగీలో ట్రావెలింగ్ టిక్కెట్ కలెక్టర్ (టీటీఈ) మరో వ్యక్తితో కలిసి ఓ మహిళా ప్రయాణికురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నమెంట్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి టీటీఈని గుర్తించి అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ జిల్లాలో జరిగింది. 
 
చందౌసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేబీ సింగ్ వెల్లడించిన వివరాల మేరకు.. సుబేదార్ గంజ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోసం వేచిచూస్తున్న ఓ మహిళ (33)ను చూసిన టీటీఈ ఏసీ బోగీలోని తన సీటులో కూర్చోవాల్సిందిగా కోరాడు. దీంతో ఆ మహిళ ఆ బోగీలో ఎక్కి కూర్చొంది. కొంతసమయం తర్వాత మరో వ్యక్తితో కలిసి అక్కడకు వచ్చిన టీటీఈ.. తన స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటనపై శనివారం బాధితురాలు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు... టీటీఈని రాజు సింగ్‌గా గుర్తించి అరెస్టు చేసినట్టు కేబీసింగ్ వెల్లడించారు. అతనితో కలిసి అత్యాచారానికి పాల్పడిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. నిందితుడిపై ఐపీసీ 376డి సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, బాధితురాలు నిందితుడు టీటీఈ రాజు సింగ్‌కు తెలిసిన మహిళ కావడం గమనార్హం. ఈ దారుణం ఈ నెల 16వ తేదీన రాత్రి పది గంటల సమయంలో చందౌనసి అలీఘర్ స్టేషన్ల మధ్య జరిగింది. బాధితురాలు చందౌసి నుంచి ప్రయాగ్ రాజ్ సుబేదార్‌గంజ్‌కు వెళుతుండగా అత్యాచారానికి గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments