Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూవింగ్ ట్రైను ఏసీ బోగీలో మహిళపై టీటీఈ అత్యాచారం...

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (08:23 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. వేగంగా వెళుతున్న రైలు ఏసీ బోగీలో ట్రావెలింగ్ టిక్కెట్ కలెక్టర్ (టీటీఈ) మరో వ్యక్తితో కలిసి ఓ మహిళా ప్రయాణికురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నమెంట్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి టీటీఈని గుర్తించి అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ జిల్లాలో జరిగింది. 
 
చందౌసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేబీ సింగ్ వెల్లడించిన వివరాల మేరకు.. సుబేదార్ గంజ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోసం వేచిచూస్తున్న ఓ మహిళ (33)ను చూసిన టీటీఈ ఏసీ బోగీలోని తన సీటులో కూర్చోవాల్సిందిగా కోరాడు. దీంతో ఆ మహిళ ఆ బోగీలో ఎక్కి కూర్చొంది. కొంతసమయం తర్వాత మరో వ్యక్తితో కలిసి అక్కడకు వచ్చిన టీటీఈ.. తన స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటనపై శనివారం బాధితురాలు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు... టీటీఈని రాజు సింగ్‌గా గుర్తించి అరెస్టు చేసినట్టు కేబీసింగ్ వెల్లడించారు. అతనితో కలిసి అత్యాచారానికి పాల్పడిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. నిందితుడిపై ఐపీసీ 376డి సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, బాధితురాలు నిందితుడు టీటీఈ రాజు సింగ్‌కు తెలిసిన మహిళ కావడం గమనార్హం. ఈ దారుణం ఈ నెల 16వ తేదీన రాత్రి పది గంటల సమయంలో చందౌనసి అలీఘర్ స్టేషన్ల మధ్య జరిగింది. బాధితురాలు చందౌసి నుంచి ప్రయాగ్ రాజ్ సుబేదార్‌గంజ్‌కు వెళుతుండగా అత్యాచారానికి గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

తర్వాతి కథనం
Show comments