Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరి కూలీల ప్రాణాలు తీసిన సెప్టిక్ ట్యాంక్

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (12:41 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఓ విషాదం జరిగింది. ఇద్దరు కూలీలు సెప్టెక్ ట్యాంకును శుభ్రం చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ట్యాంకు నుంచి విష వాయువు సోకడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక కొండపూర్‌లోని గౌతమి ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ ఉంది. దీన్ని శుభ్రం చేసేందుకు భవన యజమాని ఇద్దరు కూలీలను మాట్లాడుకున్నారు. వారిద్దరూ ఆదివారం వచ్చి ట్యాంకును క్లీన్ చేసేందుకు అందులోకి దిగారు. 
 
అయితే, ట్యాంకులో విషవాయు సోకడంతో పాటు.. ఊపిరాడక వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ బృందం అక్కడకు చేరుకుని ట్యాంకులో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కూలీల మృతదేహాలను వెలికితీశారు. 
 
మృతులను నల్గొండ జిల్లా దేవరకొండ మండలం, ఘాజీనగర్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరూ తమతమ కుటుంబాలతో కలిసి సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments