Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని చెట్టుకు కట్టేసి... ప్రియురాలిపై అత్యాచారం...

ఠాగూర్
గురువారం, 30 మే 2024 (10:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని దామరాయ గ్రామ పరిసరాల్లో మంగళవారం రాత్రి ప్రేమికుడిని కట్టేసి, ప్రియురాలిపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు వారికి తెలిసిన వ్యక్తే కావడం గమనార్హం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యువతి, యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ, కొన్నాళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. ఆ యువకుడికి ఏడుమలై, బాలాజీ అనే స్నేహితులు ఉన్నారు. 
 
మంగళవారం ఉదయం ఏడుమలై, ఆ యువకుడు సూళ్లూరుపేటలో మద్యం తాగారు. మళ్లీ రాత్రి ఏడుమలై ఆ యువకుడికి ఫోన్‌ చేసి నీ ప్రియురాలి జన్మదినం సందర్భంగా ఆమెను తీసుకుని కొరిడి శివాలయం వద్దకు వెళ్దామని నమ్మబలికాడు. కంపెనీలో పనికి వెళ్లిన ప్రియురాలి కోసం ఆ యువకుడు సూళ్లూరుపేటలోని వైజంక్షన్‌ వద్ద వేచి ఉండగా ఏడుమలై, బాలాజీ వచ్చారు. 
 
కొంతసేపటికి ఆమె రావడంతో అందరూ కలిసి బయలుదేరారు. పులికాట్‌ తీరంలోని దామరాయ పరిసరాల్లోకి వెళ్లగానే ఏడుమలై, బాలాజీ కలిసి ఆ యువకుడి చొక్కా విప్పి, దాంతోనే అతణ్ని కట్టేశారు. బాలాజీ కాపలాగా ఉండగా ఏడుమలై యువతిని (20) బెదిరించి అత్యాచారం చేశాడు. వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్‌ లాక్కుని పారిపోయారు. బాధితులు కుటుంబసభ్యులతో కలిసి శ్రీహరికోట పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments