Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. సర్వదర్శనానికి 18 గంటలు

Advertiesment
Tirumala

సెల్వి

, బుధవారం, 22 మే 2024 (10:03 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లు నిండి.. వెలుపల క్యూలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రత్యేక దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 
 
మంగళవారం ఒక్కరోజే 80,744 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 35,726 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 
 
శ్రీవారి హుండీలో మొత్తం ఆదాయం రూ.3.67 కోట్లకు చేరుకుంది. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో టీటీడీ వీవీఐపీ దర్శనాలను పునఃప్రారంభించి భక్తులకు దర్శనం సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరాయి మహిళతో సంబంధం పెట్టుకున్నావంటూ వేధింపులు.. భార్యను గొంతుపై కాలుతో తొక్కి చంపేసిన భర్త....