Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో బాలికపై అత్యాచారం.. గర్భందాల్చడంతో వెలుగులోకి...

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (12:25 IST)
విజయవాడ నగరంలో మరో బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. స్నేహం పేరుతో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నగరంలోని బెంజి సర్కిల్‌ ప్రాంతానికి చెందిన నిందితుడు సాయి బాధిత బాలిక (14)తో స్నేహం పేరుతో పరిచయం పెంచుకున్నాడు. ఈ యేడాది మే నెలలో బాలికను తన బైక్‌పై ఎక్కించుకుని పటమట జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలోని ఓ భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
మరో రెండు రోజుల తర్వాత మరో భవనంలోకి తీసుకెళ్లిన సాయి.. తన స్నేహితులు బబ్లు, ప్రకాశ్‌లను అక్కడికి పిలిపించి, వారంతా కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను తీసుకొచ్చి ఇంటివద్ద వదిలిపెట్టారు. 
 
అయితే, గత కొన్ని రోజులుగా బాలిక శరీరంలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లదండ్రులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యుల వద్దకు తీసుకెళ్లగా ఆ బాలిక ఆరు నెలల గర్భవతిగా తేల్చారు. 
 
బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments