Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో బాలికపై అత్యాచారం.. గర్భందాల్చడంతో వెలుగులోకి...

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (12:25 IST)
విజయవాడ నగరంలో మరో బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. స్నేహం పేరుతో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నగరంలోని బెంజి సర్కిల్‌ ప్రాంతానికి చెందిన నిందితుడు సాయి బాధిత బాలిక (14)తో స్నేహం పేరుతో పరిచయం పెంచుకున్నాడు. ఈ యేడాది మే నెలలో బాలికను తన బైక్‌పై ఎక్కించుకుని పటమట జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలోని ఓ భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
మరో రెండు రోజుల తర్వాత మరో భవనంలోకి తీసుకెళ్లిన సాయి.. తన స్నేహితులు బబ్లు, ప్రకాశ్‌లను అక్కడికి పిలిపించి, వారంతా కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను తీసుకొచ్చి ఇంటివద్ద వదిలిపెట్టారు. 
 
అయితే, గత కొన్ని రోజులుగా బాలిక శరీరంలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లదండ్రులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యుల వద్దకు తీసుకెళ్లగా ఆ బాలిక ఆరు నెలల గర్భవతిగా తేల్చారు. 
 
బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments