Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసామని చెప్తావా అంటూ మరోసారి రేప్ చేసిన వ్యక్తులు

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (15:47 IST)
ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే... మాపైనే కేసు పెడతావా అంటూ మరోసారి అత్యాచారం చేసారు. మరోవైపు పోలీసులు సైతం తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే తగాదా జరిగిందని కేసు నమోదు చేసుకున్నారని బాధితురాలు వాపోయింది.

 
హిందూపురంలో ఓ గ్రామానికి చెందిన మహిళ ఇంటికి సమీపంలో తగాదా జరిగింది. ఈ క్రమంలో మహిళపై కక్ష పెంచుకున్న ముగ్గురు వ్యక్తులు ఎవరూ లేని సమయంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గత మే నెలలో జరిగింది. దీనితో విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు తగాదా కేసు కింద నమోదు చేసుకుని బాధితురాలిని పంపేసారు.

 
విషయం తెలుసుకున్న నిందితులు.. మహిళ ఇంట్లోకెళ్లి భౌతిక దాడి చేసి మరోసారి సామూహిక అత్యాచారం చేసారు. దీనితో భయపడిపోయిన బాధితురాలు తన మకాం బెంగళూరుకు మార్చేసుకుంది. ఐతే అప్పటికీ వారు ఆమెను వదలకుండా ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారంటూ జిల్లా ఎస్పీ ముందు కన్నీటిపర్యంతమైంది బాధితురాలు. నిందితులను అరెస్టు చేయకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని బైఠాయించింది. మరోవైపు నిందితులకు ఓ పార్టీ మద్దతు పుష్కలంగా వుందనీ, అందువల్ల వారిపై కేసులు పెట్టేందుకు కూడా పోలీసులు భయపడుతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments