Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డను చంపేస్తామంటూ బెదిరించి రైలులో మహిళపై అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (09:31 IST)
ప్రయాణికులు లేని ఓ రైలు బోగీలో కన్నబిడ్డను చంపేస్తామంటూ బెదిరించిన ఇద్దరు కామాంధులు.. ఓ మహిళా ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. రైలు బోగీ ఖాళీగా ఉండటంతో ఈ దురాగతానికి పాల్పడ్డారు. రైలు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు.. ఆ రోజే నిందితులను అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన శనివారం అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్ వెళుతున్న సిఫాంగ్ రైలులో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సిఫాంగ్ ఎక్స్‌ప్రెస్ అస్సాం రాజధాని గౌహతి నుంచి బెంగాల్‌లోని అలీపూర్ ద్వార్‌కు వెళుతుండగా, ఓ మహిళ తన బిడ్డతో కలిసి శనివారం గౌహతి రైల్వే స్టేషన్‌లో ఎక్కింది. ఈ రైలు ఫకీరాగ్రామ్ చేరుకునేసరికి బోగీలోని ప్రయాణికులు దాదాపుగా ఖాళీ అయిపోయారు. 
 
ఈ క్రమంలో అదే బోగీలో ప్రయాణిస్తున్న అస్సాం వాసులు అబు (25), మొయినుల్ హక్ (26)లు బాధిత మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. మహిళ బిడ్డను రైల్లో నుంచి తోసేస్తామంటూ ఆమెను బెదిరించి, కట్టేసి కొట్టారు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ రైలు అలీపూర్‌ద్వార్ జంక్షన్‌కు చేరుకున్నాక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, తక్షణం స్పందించిన పోలీసులు శనివారం రాత్రే ఇద్దరు కామాంధులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments