Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను అమ్మవారి అంశనంటూ సోదరి తల నరేకిసిన బాలిక, పరుగులు తీసిన స్థానికులు

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (15:19 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. తను అమ్మవారి అంశనంటూ దేవత విగ్రహం వద్ద వున్న కత్తిని తీసుకుని ఇంట్లో నిద్రిస్తున్న తన సోదరి తలను నరికేసిన దారుణ ఘటన జరిగింది.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ రాష్ట్రంలోని డూంగర్‌పూర్ పరిధిలో జింజ్వాఫాలా గ్రామానికి చెందిన శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పూజలు చేస్తున్నాడు. కాసేపటికి శంకర్ పెద్దకుమార్తె వింతగా ప్రవర్తిస్తూ తను అమ్మవారి అంశనంటూ దేవతా విగ్రహం వద్దనున్న కత్తిని తీసుకుంది. ఆ కత్తితో పూజలు చేస్తున్నవారిపైకి వచ్చింది.

 
ఆమెను వారించేందుకు తండ్రి, ఆమె పెదనాన్న ప్రయత్నించగా కత్తితో వారిని తీవ్రంగా గాయపరిచింది. దీనితో భయభ్రాంతులకు గురైన అక్కడివారు బయటకు పరుగులు తీసారు. కత్తి పట్టుకున్న ఆ బాలిక ఇంట్లో బీభత్సం సృష్టించింది. చివరికి గదిలో నిద్రిస్తున్న తన సోదరి తలను కత్తితో నరికేసింది. ఆ ఘటనతో అంతా షాక్ తిన్నారు. విషయాన్ని పోలీసులకు తెలుపడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments