Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు భార్యలు, ఒక ప్రియురాలు- అతడు పోలీసు దుస్తులు వేసి యువతకి రూ. 3 కోట్లు టోకరా

ఐవీఆర్
శుక్రవారం, 8 మార్చి 2024 (17:15 IST)
అడ్డదారుల్లో డబ్బు లాగేయడం, నమ్మినవారిని ముంచేయడం, వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేయడం... ఇలా మోసాలు చేయడం సమాజంలో కొందరు చేస్తుంటారు. ఐతే అలాంటివారి ఆటలు కట్టించేందుకు పోలీసువారు ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. ఐనా కొంతమంది అమాయక ప్రజలు కేటుగాళ్ల చేతుల్లో మోసపోతూనే వుంటారు. తాజాగా ఇలాంటి ఘరానా మోసం బయటపడింది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి.
 
విశాఖపట్టణం సమీపంలోని అడవివరం గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి తన ప్రియురాలితో జత చేరి మెత్తగా మోసాలు చేయడం ప్రారంభించాడు. వీళ్ల మోసం ఎలాంటిదంటే... ఇద్దరూ పోలీసు దుస్తుల్లో వస్తారు. చూసినవారు నిజంగానే వీరు పోలీసు అధికారులేమోనని విశ్వసిస్తారు. వాళ్లకి కావల్సింది కూడా అదే. అలా నమ్మినవారితో తమకి పెద్దవాళ్లతో పరిచయాలు వున్నాయనీ, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకున్నారు.
 
ఇలా ఏకంగా రూ. 3 కోట్ల మేర మోసం చేసారు. ఆ తర్వాత విశాఖ నగరాన్ని వదిలేసి తమ మకాం హైదరాబాద్ నగరానికి మార్చేసారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోసగాళ్లు హైదరాబాద్ నగరంలో వున్నారని తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సురేష్ వద్ద విచారణ చేయగా తనకు ఇంతకుముందే ఇద్దరు భార్యలున్నట్లు తేలింది. ప్రస్తుతం ప్రియురాలితో కలిసి మోసాలు చేస్తున్నట్లు తేలింది.

సంబంధిత వార్తలు

దేవర-పుష్ప2 ఒకే రోజున విడుదలవుతాయా? రూ.30కోట్ల నష్టం?

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబుతో రామ్ చరణ్- ఫోటో వైరల్

షణ్ముఖ్ జస్వంత్ తో న్యూ ఒరిజినల్‌ని అనౌన్స్ చేసిన ETV విన్

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం దేవకీ నందన వాసుదేవ షూటింగ్ పూర్తి

ఏదైనా డ్రీం వుంటే ఒత్తిడి లోనై నిరాశకు లోనవుతాం : హీరో విజయ్ సేతుపతి

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

తర్వాతి కథనం
Show comments