Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానాస్పద స్థితిలో 22 ఏళ్ల నర్సు మృతదేహం, అఘాయిత్యం చేసి హత్య చేసారేమో?

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (15:01 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్‌ భన్వర్కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతదేహం కనిపించడంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. యువతిది హత్యేమోనని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి చేతిపై సూదితో పొడిచినట్లు కొన్ని సూది గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
 
తన సోదరి దీపికా ప్రజాపతి (22) ఖాండ్వా నివాసి అని మృతురాలి సోదరుడు నితిన్ ప్రజాపతి చెప్పారు. ఆమె ఇండోర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుందని, శనివారం రాత్రి షిఫ్ట్ ఉంది, రాత్రి షిఫ్ట్ తర్వాత ఆమె తన తాత్కాలిక ఇంటికి తేజాజీ నగర్‌కు తిరిగి వెళ్లాల్సి వుంది. ఐతే ఆ సమయంలో ఆమె భన్వర్కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎందుకు దిగిందో తమకు అర్థం కావడంలేదన్నారు. తమ సోదరిని ఎవరో హత్య చేసి వుంటారని అనుమానం వ్యక్తం చేసాడు.
 
ఈ సంఘటనకు సంబంధించి, డిసిపి సింగ్ మాట్లాడుతూ, ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. యువతి చేతిపై కొన్ని సూది గుర్తులు కనిపించాయనీ, శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించడం లేదన్నారు. పోస్టుమార్టం తర్వాతే మరిన్ని వివరాలు వెల్లడించగలమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

యూకేలో హరి హర వీరమల్లూ గ్రాండ్ సెలబ్రేషన్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments