Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం అక్కను చంపేశాడు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (12:27 IST)
ఆస్తి కోసం అక్కను చంపేశాడో సోదరుడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... పట్టణంలోని సీతారాంపురానికి చెందిన స్వరూపారాణి ఈ నెల 5వ తేదీన తలకు తీవ్ర గాయమై ముఖం, ఛాతి పాక్షికంగా కాలిపోయి స్నానపు గదిలో రక్తపు మడుగులో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించింది. పెన్ పహాడ్ మండలం అనాజిపురం గ్రామానికి చెందిన రాజకుమార్ తన చెల్లెలు స్వరూపారాణి వద్ద పదేళ్ల క్రితం తన తండ్రి పేరున ఉన్న మూడు వందల గజాల ప్లాట్ దస్త్రాలు కుదువపెట్టి రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇస్తానని ప్లాట్ కాగితాలు తిరిగి ఇవ్వాలంటూ ఆరు నెలలుగా తన చెల్లెలును అడుగుతున్నాడు. 
 
తండ్రి సంపాదించిన ఆస్తిలో తనకూ సమాన వాటా ఉంటుందని, ఇచ్చిన డబ్బులకు వడ్డీ లెక్క కడితే నీ వాటాకు లెక్క సరిపోతుందని స్వరూపారాణి బదులు చెబుతూ వస్తోంది. ప్లాట్ కాగితాలు ఇవ్వకపోవడంతో చెల్లెలుపై కోపం పెంచుకున్న రాజకుమార్ ఆమెను హత్య చేసి కాగితాలతోపాటు ఆమె వద్దనున్న బంగారాన్ని అపహరించాలని నిర్ణయించుకున్నాడు. అందులోభాగంగా ఈ నెల 5వ తేదీ సాయంత్రం సీతారాంపురంలోని స్వరూపారాణి ఇంటికి వెళ్లి ఆమె ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకొని ఇనుప కడ్డీతో తలపై విచక్షణారహితంగా కొట్టాడు. 
 
ఆమె మెడ మీద ఉన్న పుస్తెలతాడు తీసుకొని, అక్కడున్న వస్త్రాలకు నిప్పంటించి ఆమె ముఖంపై వేసి, విద్యుదాఘాతంతో మృతిచెందినట్లు నమ్మించాలని ప్రయత్నించాడు. అనంతరం అక్కడి నుంచి తిరిగి స్వగ్రామం వెళ్లాడు. హత్య జరగడానికి ముందు రాజకుమార్ మృతురాలి ఇంటికి వచ్చి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments