Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

ఠాగూర్
సోమవారం, 14 ఏప్రియల్ 2025 (08:44 IST)
తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్తను చంపేందుకు ఓ వ్యక్తి కుట్రపన్నాడు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌తో రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ, నగదు లావాదేవీల్లో తేడా రావడంతో ప్రియురాలి భర్తను హత్య చేయకుండా సుపారీ గ్యాంగ్ వదిలివేసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రాము అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ మహిళ భర్తను చంపేందుకు ఆమెతో కలిసి రాము కుట్రపన్నాడు. ఇందుకోసం ఓ సుపారీ గ్యాంగ్‌తో రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, ముందుగా రూ.5 లక్షలు నగదు ఇచ్చాడు.  
 
సుపారీ గ్యాంగ్ బాధితుడుని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, హత్య చేయడానికి ముందు రాముకు ఫోన్ చేసి మిగతా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా, రాము నిరాకరించాడు. దీంతో సుపారీ గ్యాంగ్ హత్యకు పూనుకోలేదు. పైగా బాధితుడు వద్ద ఉన్న నగదు, నగలను దోచుకున్నారు. 
 
దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. హత్యకు ఒప్పందం చేసుకున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి మారణాయుధాలతో పాటు రూ.90 వేల నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నతో మాట్లాడినా లింకులు పెట్టేస్తున్నారు.. రెండో పెళ్లి అంటూ ట్రోల్ చేస్తున్నారు... జాను వీడియో

అనిరుధ్ సంగీతానికి అభిమాని అయిపోయా : విజయ్ దేవరకొండ

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments