Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

Advertiesment
deadbody

ఠాగూర్

, ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (09:47 IST)
ఆ ఇంటి పెద్ద (భర్త) ఊరెళ్ళి వచ్చేసరికి భార్య, కుమార్తెలు అనుమానాస్పదస్థితిలో శవాలై కనిపించారు. గొంతు కోసిన స్థితిలో కుమార్తె, ఉరితాడుకు వేలాడుతూ భార్య ఉంది. ఈ షాకింగ్ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగింది. తాజా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి ఓ ఎరువుల ఫ్యాక్టరీలో సేల్స్ మేనేజరుగా పని చేస్తున్నారు. ఈయన భార్య రాజేశ్వరి(34), కుమార్తె వేదశ్రీ, వేద సాయిశ్రీ (13)తో కలిసి మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. సీతారాంరెడ్డి ఈ నెల 10వ తేదీన తన కార్యాలయ పని నిమిత్తం హైదరాబాద్ నగరానికి వెళ్లి శనివారం సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. 
 
అపుడే నిద్రలేచిన పెద్ద కుమార్తె వేదశ్రీ తలుపుతీసి అమ్మా, చెల్లి నిద్రపోతున్నారని చెప్పింది. దీంతో వేద సాయిశ్రీని నిద్రలేపేందుకు దుప్పటి తొలగించగా గొంతు కోసి చనిపోయివుంది. మరో గది లోపల గడియపెట్టి ఉండటంతో తలుపు బద్ధలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్య రాజేశ్వరి ఉరికి వేలాడుతూ కనిపించింది. 
 
అలాగే, ఎడమచేతి మణికట్టు వద్ద నరం కోసి ఉంది. దీంతో కుప్పకూలిపోయిన సీతారాం రెడ్డి పోలీసులకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య