Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలిపై మోహం .. భార్య - అత్త - అమ్మమ్మలపై ఉన్మాది కత్తితో దాడి

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (19:14 IST)
సభ్య సమాజంలో అపుడపుడూ అక్కడక్కడా కొన్ని సంఘటనలు తలదించుకునేలా ఉంటున్నాయి. ఓ వివాహితుడు తనకు మరదలి వరుసయ్యే భార్య చెల్లిపై వ్యామోహం పెంచుకున్నాడు. ఒకవైపు భార్యతో కాపురం చేస్తూనే మరోవైపు మరదలితో పడక సుఖానికి తహతహలాడాడు. ఈ విషయం తెలిసి మందలించిన భార్యతో అత్తపై కత్తితోదాడి చేశాడు. ఈ దారుణం తెలంగాణా రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ వివాహితుడు మరదలిపై మనసు పారేసుకున్నాడు. ఆమెపై రోజురోజుకూ వ్యామోహం పెంచుకోసాగాడు. ఈ విషయాన్ని గ్రహించిన భార్య భర్తను మందలించి,  విషయాన్ని తన తల్లి, అమ్మమ్మకు చెప్పింది. 
 
అంతే.. ఒక్కసారిగా అగ్రహోద్రుక్తుడైన ఆ ఉన్మాది కత్తితో భార్య, అత్త, అమ్మమ్మపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments