Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలమూరులో సామూహిక అత్యాచారం - బాధితురాలు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (18:33 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు (మహబూబ్ నగర్) జిల్లాలో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ జిల్లాలోని ఆలేరు గ్రామానికి చెందిన 23 యేళ్ల యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉండగా, నలుగురు యువకులు ఇంట్లో చొరబడి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ అవమానం భరించలేక ఆ యువతి తనను గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు యువకుల పేర్లతో సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 18వ తేదీన పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది. 
 
దీన్ని గమనించిన ఆ యువతి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వల్ల గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం