Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డను దారికి తెచ్చుకునేందుకు ఉరేసుకుంటానని బెదిరించిన తల్లి.. చివరకు...

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (13:57 IST)
పాఠశాలకు వెళ్లనంటూ మారాం చేసిన బిడ్డను దారికి తెచ్చుకునేందుకు ఉరేసుకుంటానని బెదిరించిన ఓ తల్లి కథ చివరకు విషాదాంతంగా ముగిసింది. కాలు జారడంతో ఆమె మెడకు వేసుకున్న ఉరి కాస్త బిగుసుకుంది. దీంతో ఆ ఆమె కన్నబిడ్డ ముందే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కోయంబత్తూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా అప్పనేకర్ రోడ్డులో సుధాకర్, యమునాబాయి అనే దంపతులు ఉన్నారు. వీరికి 16, 14 వయస్సున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ ఇంటికి సమీపంలో ఉండే పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే, ఒక కుమారుడు స్కూలుకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నాడు. ఇది గత కొన్ని రోజులుగా సాగుతోంది. దీంతో కొడుకును దారికి తెచ్చుకునేందుకు యమునాబాయి... స్కూలుకు వెళ్లకుంటే ఉరేసుకుంటానని బెదిరించింది. 
 
దీనిని కొడుకు తేలిగ్గా తీసుకోవడంతో యమునాబాయి గొంతుకు ఉరితాడు బిగించుకుంది. ఆపై కొడుకును బెదిరిస్తుండగా, ఆమె కాలు జారింది. దీంతో మెడకు ఉరితాడు బిగుసుకుంది. కొడుకు పరుగెత్తుకుంటూ వెళ్లి చుట్టుపక్కల వారిని పిలుచుకుని వచ్చేలోపు యమునాబాయి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయినప్పటికీ ఆమెను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments