బిడ్డను దారికి తెచ్చుకునేందుకు ఉరేసుకుంటానని బెదిరించిన తల్లి.. చివరకు...

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (13:57 IST)
పాఠశాలకు వెళ్లనంటూ మారాం చేసిన బిడ్డను దారికి తెచ్చుకునేందుకు ఉరేసుకుంటానని బెదిరించిన ఓ తల్లి కథ చివరకు విషాదాంతంగా ముగిసింది. కాలు జారడంతో ఆమె మెడకు వేసుకున్న ఉరి కాస్త బిగుసుకుంది. దీంతో ఆ ఆమె కన్నబిడ్డ ముందే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కోయంబత్తూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా అప్పనేకర్ రోడ్డులో సుధాకర్, యమునాబాయి అనే దంపతులు ఉన్నారు. వీరికి 16, 14 వయస్సున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ ఇంటికి సమీపంలో ఉండే పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే, ఒక కుమారుడు స్కూలుకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నాడు. ఇది గత కొన్ని రోజులుగా సాగుతోంది. దీంతో కొడుకును దారికి తెచ్చుకునేందుకు యమునాబాయి... స్కూలుకు వెళ్లకుంటే ఉరేసుకుంటానని బెదిరించింది. 
 
దీనిని కొడుకు తేలిగ్గా తీసుకోవడంతో యమునాబాయి గొంతుకు ఉరితాడు బిగించుకుంది. ఆపై కొడుకును బెదిరిస్తుండగా, ఆమె కాలు జారింది. దీంతో మెడకు ఉరితాడు బిగుసుకుంది. కొడుకు పరుగెత్తుకుంటూ వెళ్లి చుట్టుపక్కల వారిని పిలుచుకుని వచ్చేలోపు యమునాబాయి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయినప్పటికీ ఆమెను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments