Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టపగలు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కన్నతండ్రిని పొడిచి చంపేసిన కొడుకు...

ఠాగూర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (18:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా పరిధిలో పట్టపగలు ఓ దారుణం చోటుచేసుకుంది. నడి రోడ్డుపై పట్టపగలు అందరూ చూస్తుండగా తండ్రిని కన్నకొడుకు కత్తితో పొడిచి చంపేశాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... 
 
సికింద్రాబాద్ద లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి (45) అనే వ్యక్తికి కుమారుడు సాయి కుమార్ (25) ఉండగా, వీరిద్దరూ కలిసి ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో పని చేస్తున్నారు. మొగిలి నిత్యం మద్యం సేవించి ఇంట్లో గొడవ చేస్తుండటంతో సాయి కుమార్ విసిగిపోయాడు. 
 
శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి మొగిలి బస్సులో బయలుదేరగా, అతని కుమారుడు బైకుపై అనుసరించాడు. ఈసీఐఎల్ బస్ టర్మినల్ వద్ద బస్సు దిగిన తండ్రిని తన వెంట తెచ్చుకున్న చాకుతో విచక్షణా రహితంగా 10, 15 సార్లు పొడిచాడు. 
 
దీంతో తీవ్రంగా గాయపడిన మొగిలిని స్థానికంగా ఉండే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తండ్రిపై కుమారుడు కత్తితో దాడి చేస్తున్న దృశ్యాసలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సాయి కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments