Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఇంట్లో ఐదు అస్థిపంజరాలు... కర్నాటకలోని చిత్రదుర్గలో ఘటన

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (11:44 IST)
కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలోని ఓ ఇంట్లో ఐదు అస్థిపంజరాలు వెలుగు చూశాయి. గత 2019లో చివరి సారి కనిపించిన ఓ కుటుంబ సభ్యులంతా ఇపుడు అస్థిపంజరాలుగా బయటపడ్డారు. అయితే, వీరిని ఎవరైనా హత్య చేశారా లేదా వారే ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పైగా, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో తాళం వేసి ఉన్న ఇంట్లో ఐదుగురి అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరిని ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగన్నాథ్ రెడ్డి (85), ఆయన భార్య ప్రేమ (80), కుమార్తె త్రివేణి (62), కుమారులు కృష్ణ (60), నరేంద్ర (57)గా గుర్తించారు. పోస్టుమార్టం తర్వాత కానీ వారి మృతికి గల ఖచ్చితమైన కారణం చెప్పలేమని పోలీసులు తెలిపారు. వీరు చివరిసారి 2019లో కనిపించారని, ఆ తర్వాతి నుంచి ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు.
 
స్థానికంగా చాలాకాలంగా తాళం వేసి కనిపిస్తున్న ఇంటి గురించి స్థానికుడు ఒకరు గురువారం మీడియాకు తెలియజేయగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. అదే రోజు సాయంత్రం పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన పరిచయస్తులు, బంధువులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్నాథ్ రెడ్డి కుటుంబం ఏకాంత జీవితం గడుపుతున్నట్టు తెలుసుకున్నారు. వారందరూ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. చివరిసారి వారు జూన్-జులై 2019లో కనిపించినట్టు తెలిపారు.
 
ఆ ఇంట్లో 2019 సంవత్సరం నాటి క్యాలెండర్ వేలాడదీసి ఉండడంతో ఘటన అదే ఏడాది జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి ఆ ఇంటి వైపు ఎవరూ వెళ్లకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదని వివరించారు. నాలుగు అస్థిపంజరాల్లో రెండు మంచంపైన, రెండు నేల మీద పడివున్నట్టు పోలీసులు తెలిపారు. మరో గదిలో మరో అస్థిపంజరాన్ని గుర్తించారు. వారి మృతికి కచ్చితమైన కారణం తెలియదని అయితే, ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అటాప్సీ తర్వాత అసలు విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి జి.పరమేశ్వర విచారణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మానందం పాతపడిపోయాడు అందుకే కామెడీ రావడంలేదు

శేఖర్ కమ్ముల గోదావరి చిత్రం మొదట గౌతమ్ కు వస్తే వద్దనుకున్నాడు

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ నుంచి మధువరమే.. గీతం విడుదల

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ

రూ.వంద కోట్ల క్లబ్‌లో 'డాకు మహారాజ్' - 4 రోజుల్లో రూ.105 కోట్లు కలెక్షన్లు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments