Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు గాంధీ రోడ్డులో కాల్పుల కలకలం... పోలీసుల అదుపులో నిందితులు

ఠాగూర్
బుధవారం, 12 మార్చి 2025 (12:36 IST)
చిత్తూరు జిల్లా గాంధీ రోడ్డు, లక్ష్మీ సినిమా మహాల్ సమీపంలో కొందరు దుండగులు మంగళవారం అర్థరాత్రి సమయంలో కాల్పులకు తెగబడ్డారు. పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని నివాసంలోకి ప్రవేశించిన దుండగులు... వారిని బెదిరించేందుకు గాల్లో కాల్పులు జరిపారు. అయితే, మాల్ యజమాని అప్రమత్తమై పోలీసులకు సకాలంలో సమాచారం చేరవేయడంతో పెను ముప్పు తప్పింది. 
 
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని నలుగురు దండుగులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకులు, కత్తులతో పాటు పొగ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న దండగులను స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మణికంఠ పరిశీలించారు. మరో ఇద్దరు దుండగులు అక్కడే ఉన్నట్టు వచ్చిన సమాచారంతో పోలీసులు పుష్పమాల్ ఇంటి యజమాని నివాసంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను గాలిస్తున్నారు. 
 
కాగా, ఎంతో ప్రశాంతంగా ఉండే చిత్తూరు జిల్లా కేంద్రంలో కొందరు దుండగులు కాల్పులు జరపడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. కాగా, ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు సకాలంలో స్పందించడంతో పెను ముప్పు తప్పిందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments