Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి మోజులోపడి స్నేహితుడి ద్వారా భర్తకు సైనైడ్ ఇచ్చిన భార్య...

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (10:31 IST)
దేశంలో వివాహేతర సంబంధాల కారణంగా జరుగతున్న హత్యల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో ఓ వివాహిత ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తకు సైనైడ్ ఇచ్చి హతమార్చింది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్, జునాఘడ్ పట్టణానికి చెందిన రఫీక్, మొహమూదాలు అనే భార్య భర్తలు ఉన్నారు. అయితే, మొహమదాలుకూ ఆసిఫ్ చౌహాన్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రియుడిపై చచ్చేటంత ప్రాణం పెట్టుకున్న మొహమదాలు ప్రియుడిని పెళ్లాడాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసి, తన మనస్సులోని ఆలోచనను ప్రియుడు ఆసిఫ్‌కు చెప్పింది. దానికి అతను కూడా సమ్మతించి, తన స్నేహితుడు ఇమ్రాన్ సాయం తీసుకున్నాడు. 
 
తమ పథకంలో భాగంగా ఇమ్రాన్‌తో సైనైడ్ తెప్పించి భర్త రఫీక్‌తో పాటు అతని స్నేహితుడు భరత్‌కు సైనైడ్ కలిపిన శీతలపానీయం ఇచ్చింది. ఈ కూల్‌డ్రింక్స్ సేవించగానే రఫీక్, భరత్‌లు స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆ తర్వాత జరిపిన శవపరీక్షలో వారు తాగిన శీతలపానీయంలో విషం ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెల్లడైంది. దీంతో హత్యకు కారణమైన మొహమూదా, ఆసిఫ్, ఇమ్రాన్‌లను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments