తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 23 డిశెంబరు 2024 (09:19 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సబరకాంత దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తాను చేసిన అప్పును సకాలంలో తీర్చలేకపోయాడు. దీంతో అతని ఏడేళ్ల కుమార్తెను వడ్డీ వ్యాపారులు కిడ్నాప్ చేసి, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని విక్రయించారు. ఈ దారుణంపై బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో వారు వేగంగా స్పందించి వడ్డీ వ్యాపారులను, బాలికను కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, ఆ బాలికను కూడా రక్షించారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... సబరకాంత జిల్లాకు చెందిన ఓ రోజు కూలీ అదే ప్రాంతానికి చెందిన అర్జున్ నాథ్ అనే వడ్డీవ్యాపారి వద్ద అధిక వడ్డీకి రూ.60 వేలు అప్పు తీసుకున్నాడు. క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ అర్జున్ నాథ్ వేధింపులకు గురిచేయసాగాడు. ఈ క్రమంలో అసలు రూ.3 లక్షలకు పెరిగిందని చెప్పి మొత్తం తిరిగివ్వాలని డిమాండ్ చేశాడని చెప్పారు. 
 
మరో ఇద్దరు వడ్డీ వ్యాపారులు షరీఫానాథ్, లఖ్‌పతినాథ్‌లతో కలిసి ఇటీవల తనపై దాడి చేశాడని చెప్పారు. తనను తీవ్రంగా కొట్టి ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. ఆపై ఏడేళ్ల తన కూతురును కిడ్నాప్ చేసి రూ.3 లక్షలకు అమ్మేసినట్లు చెప్పారు. ఈ బాలికను రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ సమీపంలో ఉన్న ఓ గ్రామస్థుడు కొనుగోలు చేశాడు. 
 
దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి వడ్డీ వ్యాపారులు ముగ్గురినీ అరెస్టు చేశామని పోలీసులు వివరించారు. వారి ద్వారా రాబట్టిన వివరాల ఆధారంగా రాజస్థాన్ వెళ్లి బాలికను కాపాడి తీసుకొచ్చామని తెలిపారు. నిందితులు ముగ్గురినీ కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. ఎఫ్ఎస్ఐఆర్ నమోదైన గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి బాలికను కాపాడినట్లు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments