Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

Advertiesment
attack

ఠాగూర్

, శుక్రవారం, 20 డిశెంబరు 2024 (19:21 IST)
కొత్తగా వివాహం చేసుకున్న తన కుమార్తె - అల్లుడు హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలన్న అంశంపై మామా అల్లుళ్ల మధ్య పెను వివాదాన్ని సృష్టించింది. మామ మాటను అల్లుడు కాదన్నాడు. దీన్ని భరించలేని మామ.. కుమార్తె భర్త, ఇంటికి అల్లుడు అని కూడా చూడకుండా యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాణె జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాణి జిల్లా కల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న జకీ గులామ్ ముర్తజా ఖోటాల్ (65) ఇటీవల తన కూతురును ఇబాద్ అతీక్ ఫాల్కే (29)కు ఇచ్చి వివాహం చేశాడు. హనీమూన్ వెళ్లే విషయంపై మామాఅల్లుళ్ల మధ్య వివాదం రేగింది. కాశ్మీర్‌కు వెళతామని ఫాల్కే చెప్పగా, వద్దు విదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లండని ఖోటాల్ సూచించాడు. 
 
ఈ విషయంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. గొడవ పెద్దదవుతుండడంతో ఇంట్లో వాళ్లు కలగజేసుకున్నారు. దీంతో ఖోటాల్ తాత్కాలికంగా వెనక్కితగ్గాడు. అయితే, ఖోటాల్‌కు తన మాట కాదన్నందుకు అల్లుడిపై కోపం మాత్రం తగ్గలేదు. సాయంత్రం యాసిడ్ సంపాదించి అల్లుడి ఇంటి దగ్గర కాపుకాచాడు. 
 
తన కారులో కూర్చుని అల్లుడు వచ్చే వరకు ఎదురుచూశాడు. ఆఫీసు నుంచి ఇంటికి చేరుకున్న ఫాల్కే.. రోడ్డు పక్కన తన స్కూటర్ పార్క్ చేసి ఇంట్లోకి వెళుతుండగా ఖోటాల్ ఉన్నట్టుండి ఎదురు వచ్చి యాసిడ్ చల్లి పారిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు ఫాల్కేను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫాల్కే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న ఖోటాల్ కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’