Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 23 డిశెంబరు 2024 (09:19 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సబరకాంత దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తాను చేసిన అప్పును సకాలంలో తీర్చలేకపోయాడు. దీంతో అతని ఏడేళ్ల కుమార్తెను వడ్డీ వ్యాపారులు కిడ్నాప్ చేసి, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని విక్రయించారు. ఈ దారుణంపై బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో వారు వేగంగా స్పందించి వడ్డీ వ్యాపారులను, బాలికను కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, ఆ బాలికను కూడా రక్షించారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... సబరకాంత జిల్లాకు చెందిన ఓ రోజు కూలీ అదే ప్రాంతానికి చెందిన అర్జున్ నాథ్ అనే వడ్డీవ్యాపారి వద్ద అధిక వడ్డీకి రూ.60 వేలు అప్పు తీసుకున్నాడు. క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ అర్జున్ నాథ్ వేధింపులకు గురిచేయసాగాడు. ఈ క్రమంలో అసలు రూ.3 లక్షలకు పెరిగిందని చెప్పి మొత్తం తిరిగివ్వాలని డిమాండ్ చేశాడని చెప్పారు. 
 
మరో ఇద్దరు వడ్డీ వ్యాపారులు షరీఫానాథ్, లఖ్‌పతినాథ్‌లతో కలిసి ఇటీవల తనపై దాడి చేశాడని చెప్పారు. తనను తీవ్రంగా కొట్టి ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. ఆపై ఏడేళ్ల తన కూతురును కిడ్నాప్ చేసి రూ.3 లక్షలకు అమ్మేసినట్లు చెప్పారు. ఈ బాలికను రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ సమీపంలో ఉన్న ఓ గ్రామస్థుడు కొనుగోలు చేశాడు. 
 
దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి వడ్డీ వ్యాపారులు ముగ్గురినీ అరెస్టు చేశామని పోలీసులు వివరించారు. వారి ద్వారా రాబట్టిన వివరాల ఆధారంగా రాజస్థాన్ వెళ్లి బాలికను కాపాడి తీసుకొచ్చామని తెలిపారు. నిందితులు ముగ్గురినీ కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. ఎఫ్ఎస్ఐఆర్ నమోదైన గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి బాలికను కాపాడినట్లు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments