Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రిని కోల్పోయిన బాలికపై ప్రభుత్వ ఉద్యోగి అత్యాచారం...

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2023 (14:08 IST)
తండ్రిని కోల్పోయిన బాలికను చేరదీస్తానంటూ ఇంటికి తీసుకొచ్చిన ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఆ బాలిక గర్భందాల్చడంతో మాత్రలు తెచ్చి ఇంట్లోనే గర్భస్రావం చేయించాడు. దీనికి అతని భార్య కూడా పూర్తిగా సహకరించింది. ఈ దారుణం ఢిల్లీలో జరిగింది. ఈ బాలిక తన స్నేహితుడి కుమార్తె కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాధిత బాలిక గత యేడాది తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత నిందితుడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత 2020-21 మధ్య కాలంలో పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. 
 
ఈ విషయాన్ని అతడు తన భార్యకు చెప్పడంతో ఆమె తన కుమారుడితో మందులు తెప్పించి ఇంట్లోనే గర్భస్రావం చేయించింది. ఆ తర్వాత కూడా ఆ కామాంధుడి ఆగడాలు మరింతగా పెరిగిపోవడంతో వాటిని తట్టుకోలేక ఆ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కామాధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments