Webdunia - Bharat's app for daily news and videos

Install App

సనత్ నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో దారుణం : క్యాంటీన్‌లో యువతిపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (12:52 IST)
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో ఈఎస్ఐ క్యాంటీన్‌లో దారుణం జరిగింది. తన సోదరుడి చికిత్స కోసం సహాయకురాలిగా వచ్చిన యువతిపై క్యాంటీన్ సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సెక్యూరిటీ గార్డు తన వంతు సాయం చేసాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటకు చెందిన యువతి (19) తన సోదరుడికి గతంలో ఈఎస్ఐ ఆస్పత్రిలో గతంలో చికిత్స చేయించింది ఇటీవల మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో ఈ నెల 6వ తేదీన వారు ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం సాయంత్రం సోదురుడికి ఆహారం కోసం వెళుతున్న ఆమెను సెక్యూరిటీ గార్డు అడ్డుకుని క్యాంటీన్‌లో పని చేసే షాదాబ్ (25)ను పరిచయం చేశాడు. సాయం అవసరమైతే అతడిని అడగాలని చెప్పడంతో సరేనని చెప్పిన ఆ యువతి తిరిగి లిప్టులో తన వార్డుకు బయలుదేరింది. 
 
అయితే, షాదాబా ఆమె వెంట వెళ్లి... రెండో అంతస్తులోకి ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత రక్త పరీక్షలు చేసే గదిలో మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన ఆ యువతి తన సోదరుడికి ఫోన్ చేయడంతో అతడొచ్చి కేకలు వేయడంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments