Webdunia - Bharat's app for daily news and videos

Install App

సనత్ నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో దారుణం : క్యాంటీన్‌లో యువతిపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (12:52 IST)
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో ఈఎస్ఐ క్యాంటీన్‌లో దారుణం జరిగింది. తన సోదరుడి చికిత్స కోసం సహాయకురాలిగా వచ్చిన యువతిపై క్యాంటీన్ సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సెక్యూరిటీ గార్డు తన వంతు సాయం చేసాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటకు చెందిన యువతి (19) తన సోదరుడికి గతంలో ఈఎస్ఐ ఆస్పత్రిలో గతంలో చికిత్స చేయించింది ఇటీవల మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో ఈ నెల 6వ తేదీన వారు ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం సాయంత్రం సోదురుడికి ఆహారం కోసం వెళుతున్న ఆమెను సెక్యూరిటీ గార్డు అడ్డుకుని క్యాంటీన్‌లో పని చేసే షాదాబ్ (25)ను పరిచయం చేశాడు. సాయం అవసరమైతే అతడిని అడగాలని చెప్పడంతో సరేనని చెప్పిన ఆ యువతి తిరిగి లిప్టులో తన వార్డుకు బయలుదేరింది. 
 
అయితే, షాదాబా ఆమె వెంట వెళ్లి... రెండో అంతస్తులోకి ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత రక్త పరీక్షలు చేసే గదిలో మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన ఆ యువతి తన సోదరుడికి ఫోన్ చేయడంతో అతడొచ్చి కేకలు వేయడంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments