Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామర్లకోటలో నడిరోడ్డుపై యువకుడు నరికివేత

Webdunia
సోమవారం, 2 మే 2022 (10:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. గత పది రోజుల వ్యవధిలో నలుగురు మహిళలపై అత్యాచారం జరిగింది. ముఖ్యంగా, ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో పొట్టచేతపట్టుకుని వచ్చిన ఓ వలసకూలీ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారం జరిపారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమైంది. తాజాగా కాకినాడి జిల్లా సామర్లకోటలో పట్టపగలు, నడిరోడ్డుపై ఓ యువకుడిని నరికి చంపేశారు. అదీకూడా అందరూ చూస్తుండగా సాటి స్నేహితుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక భాస్కర్ నగరులో నివసిస్తున్న తలాటి శివ (28) అనే వ్యక్తి తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. గతంలో రాజీవ్ గృహకల్పలో నివాసం ఉన్న సమయంలో నరాల మణికంఠ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే, వీరి మధ్య వివాదం తలెత్తడంతో అక్కడ నుంచి వచ్చేసి సోదరుడితో కలిసి భాస్కర్ నగరులో ఉంటున్నాడు. 
 
అయితే, శివపై ప్రతీకారం తీర్చుకోవాలని రగలిపోతూ వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం పుట్టినరోజు కావడంతో శివ స్థానిక విఘ్నేశ్వర థియేటర్ సమీపంలో బిర్యానీ కొనుగోలు చేసేందుకు వచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన మణికఠ కత్తితో ఒక్కసారిగా శివపై దాడి చేశాడు. 
 
అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శని చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మణికంఠ అక్కడ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments