Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సొంత జిల్లాలో దళిత బాలికపై కామాంధుల సామూహిక అత్యాచారం..

Webdunia
గురువారం, 12 మే 2022 (11:05 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఓ దళిత బాలికపై పది మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మాత్రం నిందితులను తప్పించేందుకు కుంటి సాకులు చెబుతూ కేసు నమోదు  చేసేందుకు  మీనమేషాలు లెక్కిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రొద్దుటూరులోని ఓ కాలనీ చెందిన దళిత బాలిక గర్భంతో ఉండటాన్ని ఇరుగుపొరుగువారు గుర్తించి మహిళా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి ఆ బాలిక వద్దకు వచ్చి విచారించారు. ఈ విచారణలో శివాలయం సమీపంలోని పాడైన మార్కెట్ వద్ద నుంచి చెంబు అనే వ్యక్తి తనను ఆటోలో తీసుకెళ్లి మరో తొమ్మిది మందితో కలిసి పలుమార్లు అత్యాచారం చేసినట్టు చెప్పింది. 
 
ఈ విషయాన్ని సీఐ నాగరాజుకు మహిళా పోలీసులు చెప్పారు. దీనిపై తక్షణం స్పందించాల్సిన సీఐ నాగరాజు.. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ కుంటి సాకులు చెబుతున్నారు. అంతేకాకుండా, నిందితులను తప్పించేందుకు వీలుగా ఆయన బాలికకు అబార్షన్ చేయించేందుకు ఓ ప్రైవేట్ హోంకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments