Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

ఠాగూర్
మంగళవారం, 15 జులై 2025 (09:38 IST)
ఏపీలోని పల్నాడు జిల్లా ఈపూరులో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతండ్రినే హత్య చేశాడో కుమారుడు. తాడికొండ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన వేల్పూరి శివయ్య (57) అనే వ్యక్తి ఈపూరు మండలం పొనుగోటివారి పాళెంలోన ఓ కోళ్లఫారంలో పనిచేస్తుంటారు. ఆయనకు భార్య, కుమారుడు నరేంద్ర, ఓ కుమార్తె ఉంది. కుమారుడుకి వివాహమైంది. ఆ తర్వాత కుటుంబంలో ఆస్తి గొడవలు మొదలయ్యాయి. దీంతో శివయ్య కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. 
 
అప్పుడప్పుడూ గ్రామంలోని తల్లిని చూసేందుకు వస్తుంటారు. ఈ నెల 9న రాత్రి 8.30 సమయంలో గ్రామంలోనే వేరుగా ఉంటున్న భార్య, పిల్లల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన పేరుపై ఉన్న 1.40 ఎకరం భూమి విషయంలో నరేంద్ర గొడవకు దిగాడు. ఆస్తి తనకు రాయకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. 
 
ఆ తర్వాత నిద్రిస్తున్న తండ్రిని గొంతు నులిమి హతమార్చాడు. నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. కాగా శివయ్య అనుమానాస్పద మృతిపై తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా చెమటకంపును నేను భరించలేకపోతున్నా, విషం ఇస్తే తాగి చనిపోతా: కోర్టు ముందు కన్నడ హీరో దర్శన్

Naga vamsi: వాయుపుత్ర: కేవలం సినిమా కాదు, ఒక పవిత్ర దృశ్యం : చందూ మొండేటి

Sreeleela: నిరాశగా వుంటే ధైర్యం కోసం ఇలా చేయడంటూ శ్రీలీల సూక్తులు

Sharwanand: ఇది నా విజన్. ఇది నా బాధ్యత. ఇదే OMI అంటూ కొత్త గా మారిన శర్వానంద్

Yukthi Tareja : K-ర్యాంప్ నుంచి కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా పై లవ్ మెలొడీ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments