Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చి ఇద్దరిని హత్య చేసి లారీ డ్రైవర్!!

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (18:20 IST)
భార్య, కుమార్తెను తనను వదిలి వెళ్లిపోవడానికి కారణమైందన్న కోపంతో ఓ మహిళను హత్య చేసిన లారీ డ్రైవర్, ఆ కేసులో బెయిల్‌పై బయటికొచ్చి ఆ మహిళ భర్త, ఆమె అత్తను కూడా హత్య చేసిన ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాలక్కాడ్ జిల్లాకు చెందిన 58 యేళ్ళ చెంతమార అనే వ్యక్తి లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. 2019లో తన పక్కింట్లో ఉండే సజిత అనే మహిళను చెంతమార హత్య చేశాడు. భార్య, కుమార్తె తనను వదిలి వెళ్ళిపోవడానికి సజితనే కారణమని భావించి ఆమెపై కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో స్థానిక పోలీసులు ఆయనను అరెస్టు చేయగా, ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. 
 
ఆరు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన చెంతమార.. తాజాగా సజిత భర్త సుధాకరన్ (54), ఆయన తల్లి లక్ష్మి (76)ని కూడా హత్య చేశాడు. చెంతమార జైలు నుంచి బయటకు వచ్చినపుడే ఏదైనా ఘాతుకానకి పాల్పడవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వారు అనుమానించినట్టుగానే చెంతమారు మరో ఇద్దరిని హత్య చేసి పరారీపోగా, కేసు నమోదు చేసి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments