Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంచలనం రేపుతున్న విద్యార్థిని రితీసాహు మృతి కేసు

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (17:18 IST)
ఇటీవల విశాఖపట్టణంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రితీ సాహు కేసు ఇపుడు సంచలనంగా మారింది. ఈ మృతిపై ఉన్న మిస్టరీని ఛేదించేందుకు సీఐడీని ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతో వెస్ట్ బెంగాల్ సీఐడీ పోలీసులు రంగంలోకి దిగారు. 
 
గత నెల 14వ తేదీన రితీసాహు భవనంపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఈమె స్వస్థలం వెస్ట్ బెంగాల్. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, ఈ మృతిపై విశాఖ పోలీసుల తీరుపై మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. నాలుగో పట్టణ పోలీసులు కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. 
 
హాస్టల్ యాజమాన్యం నుంచి లంచం తీసుకుని కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా సీసీటీవీ ఫుటేజీలోని లొసుగులపై నాలుగో పట్టణ సీఐపై బదిలీ వేటు పండింది. దీంతో ఈ కేసులో నాలుగో పట్టణ పోలీసుల వద్ద వెస్ట్ బెంగాల్ సీఐడీ పోలీసులు విచారణ జరుపనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments