Webdunia - Bharat's app for daily news and videos

Install App

వితంతు పింఛను ఆశ చూపి.. మహిళపై అత్యాచారం... కాకాణి అనుచరుడి అరెస్టు!!

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (15:04 IST)
వితంతు పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి ఓ వితంతువుపై అత్యాచారం చేసిన కేసులో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరుడుని నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. భర్త చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురైన ఆ మహిళను వితంతు పింఛన్, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం రాత్రి నిందితుడుని అరెస్టు చేశారు. పేరు వెంకట శేషయ్య. 
 
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ భర్త చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడం గమనించి ఉద్యోగం ఇప్పిస్తానంటూ వెంకట శేషయ్య మాయమాటలు చెప్పి వశపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత రోజూ ఫోన్ చేస్తూ తన కోరిక తీర్చాలని వేధించాడని బాధితురాలు తెలిపింది. 
 
పైగా, తెల్లకాగితంపై సంతకం చేయించుకుని నిత్యం బెదిరించేవాడని ఆరోపించింది. వెంకట శేషయ్య వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఉద్యోగం ఇప్పిస్తానని వెంకట శేషయ్య తనను మోసం చేశాడని, పలుమార్లు తనపై లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో సోమవారం రాత్రి వెంకట శేషయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
వెంకట శేషయ్యను అరెస్టు చేశారని తెలిసి మాజీ మంత్రి కాకాణి అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. దీంతో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు వివరాలను వివరించి అందరినీ అక్కడి నుంచి పంపించివేశారు. ఆపై వెంకట శేషయ్యను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు పూర్తయ్యాక కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం