Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

ఠాగూర్
గురువారం, 15 మే 2025 (19:42 IST)
సమోసా విషయంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ ఆ షావు యజమాని హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాకేశ్ అనే వ్యక్తికి ఫరూక్ నగర్ ప్రాంతంలో టీ స్టాల్ ఉంది. ఈ నెల 12వ తేదీన నిందితుడు పంకజ్ తన అనుచరులతో కలిసి టీ స్టాల్‌కు వచ్చి సమోసా ఇవ్వాలని కోరాడు. ఈ విషయంపై షాపు యజమానికి పంకజ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోయిన పంకజ్.. కొద్దిసేపటికి తన అనుచరులతో కలిసి షాపు వద్దకు చేరుకుని మళ్లీ యజమానితో ఘర్షణపడ్డాడు. 
 
ఈ క్రమంలో షాపు యజమానిపై ఆరుసార్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత రాకేష్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు.. ఫరూఖ్ నగర్ - ఝజ్జర్ రహదారిని దిగ్బంధించారు. వ్యాపారులు తమ షాపులను మూసివేసి నిరసన తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను శాంతపరిచారు. మరోవైపు, పరారీలో ఉన్న నిందితులను 48 గంటల్లో అరెస్టు చేస్తామంటూ గ్రామస్థులకు హామీ ఇచ్చారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments