Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత బాలికపై నలుగురు బాలుర ఘాతుకం.. బెదిరించి యేడాదిగా అత్యాచారం..

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (14:22 IST)
ఏపీలోని విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో నలుగురు యువకులు ఘాతుక చర్యకు పాల్పడ్డారు. దళిత బాలికపై నలుగురు యువకులు గత యేడాది కాలంగా బెదిరిస్తూ అత్యాచారం చేస్తున్నాడు. వారి బెదిరింపులకు లొంగిపోయి మానసికవేదన అనుభవిస్తున్న కుమార్తె ప్రవర్తను అమ్మమ్మ పసిగట్టి... నిలదీయడంతో అసలు విషయాన్ని వెల్లడించింది. దీంపో ఆండ్ర పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
మెంటాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒక విద్యార్థిని స్థానికంగా ఉండే నలుగురు బాలురు గత కొంతకాలంగా బెదిరించి లొంగదీసుకుని అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ తంతు గత యేడాదిగా సాగుతుంది. ఆ బాలిక తల్లిదండ్రులు మనస్పర్థల కారణంగా వేర్వేరుగా ఉండటంతో బాలిక మాత్రం అమ్మమ్మ సంరక్షణలో ఉండేది. 
 
అయితే, గత కొద్ది రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు కనిపించడాన్ని అమ్మమ్మ గుర్తించింది. పైగా బాలిక ముభావంగా ఉండటం, ఇదివరకటిలా తనతో మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చి ప్రశ్నించింది. దీంతో భోరున విలపిస్తూ బాలిక విషయం చెప్పింది. వెంటనే అమ్మమ్మ కులపెద్దలు, గ్రామపెద్దల దృష్టికి తీసుకు వెళ్లగా వారు ఆ నలుగురు యువకుల తల్లిదండ్రులను పిలిచి హెచ్చరించారు. 
 
ఆ సమయంలో యువకుల బంధువులు గొడవకు దిగారు. ఈ పరిణామంపై పెద్దల సూచనతో బాధితురాలు రెండ్రోజుల క్రితం ఆండ్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై బొబ్బిలి డీఎస్పీ శ్రీధర్‌ మంగళవారం దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉండగా ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments