Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికకు 15 - బాలుడికి 17 : ప్రేమ పేరుతో ఒక్కటైన జంట - ఆపై గర్భం

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (08:14 IST)
విశాఖపట్టణం జిల్లా చింతపల్లి మండలంలో దురదృష్టకర ఘటన జరిగింది. 15 యేళ్ళ బాలికను 17 యేళ్ల బాలుడు గర్భవతిని చేశాడు. ప్రస్తుతం ఆ బాలిక 8 నెలల గర్భవతి. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు హతాశులైపోయారు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి బాలుడిని అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చింతపల్లి మండలోని తాజంగి పంచాయతీ పరిధిలోని బోయపాడు గ్రామానికి చెందిన 15 యేళ్ళ బాలిక స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదివి ఇంటిపట్టునే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన 17 యేళ్ల బాలుడు ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటున్నాడు. 
 
ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ ఏకాంతంగా శారీరకంగా కలుసుకుంటూ వచ్చారు. దీంతో ఇటీవల ఆ బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లి నర్సీపట్నం ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలికను పరిశీలించిన వైద్యులు... ఆమె ఎనిమిది నెలల గర్భవతి తేల్చారు. 
 
వైద్యులు నోటి వెంట తమ కుమార్తె గర్భవతి అనే మాట రాగనే తల్లిదండ్రులిద్దూ హతాశులై అక్కడే కుప్పకూలిపోయారు. ఆ తర్వాత తేరుకుని బాలుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... బాలుడుని అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం