Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్నే పెళ్లిచేసుకో, మరదలికి అక్కమొగుడు వేధింపులు

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (11:11 IST)
ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన అక్కమొగుడు మరదలి పాలిట కామాంధుడయ్యాడు. తననే పెళ్లాడాలంటూ వేధింపులకు దిగాడు. అతడి వేధింపులను తాళలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండాలో శ్రీను, చిన్ని దంపతులకు ఐదుగురు కుమార్తెలు. కొన్నేళ్ల క్రితం శ్రీను కాలం చేసాడు. దాంతో కుటుంబ భారమంతా చిన్నిపై పడింది. ఐనా మొక్కవోని ధైర్యంతో తన ఐదుగురు కుమార్తెల్లో నలుగురికి పెళ్లిళ్లు చేసింది. చివరి కుమార్తెను విజయవాడలో ఓ యువకుడికి నిశ్చితార్థం చేసి ఏప్రిల్ 10న వివాహం చేయాలని అనుకున్నారు.

 
ఐతే యువతి మూడో అక్క భర్త ఆమెపై కన్నేశాడు. తననే పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. మూడో అల్లుడి వేధింపులు తాళలేక నాలుగో అల్లుడి వద్దకు వచ్చేసారు తల్లీకూతుళ్లు. కామాంధ అల్లుడు అక్కడికి కూడా వచ్చి మరదలిపై అఘాయిత్యం చేసేందుకు యత్నించడమే కాకుండా వేధింపులు తీవ్రతరం చేసాడు.

 
ఈ బాధలు భరించలేని యువతి పురుగులు మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. ఆమెను గమనించి హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం నాడు పరిస్థితి విషమించి ఆమె కన్నుమూసింది. తన మూడో అల్లుడి వేధింపుల కారణంగా తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నదని చిన్ని పోలీసులకి ఫిర్యాదు చేయడంతో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments