Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడిని బండరాళ్లతో కొట్టి హతం

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (19:51 IST)
ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని యువతి కుటుంబసభ్యులు బండరాళ్లతో కొట్టి హతమార్చారు. మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జైపూర్ మండలం ఇందారంలో అందరూ చూస్తుండగానే చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
ఇందారం గ్రామానికి చెందిన ఓ యువతితో ఎం. మహేష్ (24) అనే యువకుడు ప్రేమ వ్యవహారం సాగించాడు. గత ఏడాది యువతి తల్లిదండ్రులు సీసీ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు.
 
దీంతో యువతిపై క్షక్ష పెంచుకున్న మహేశ్.. ఆమెతో సన్నిహితంగా వున్న వీడియోలను సోషల్ మీడియా పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు యువకుడిపై జైపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు ఇరు వర్గాలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం యువతి భర్త విడాకులు ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ క్రమంలో యువతి తన పుట్టింటికి వచ్చింది. అయినా పలుమార్లు యువతిని మహేష్ వేధిస్తూ వచ్చాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వేధింపులు కొనసాగుతుండటంతో మంగళవారం ఉదయం మహేష్‌పై కత్తి, బండరాళ్లతో యువతి కుటుంబసభ్యులు దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments